- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన భేటీ.. ఆమెతో కలిసి భోజనం చేసిన CM రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్భేటీ అయ్యారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి ఆమె భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్భేటీ అయ్యారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్రెడ్డి ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి ఇరువురి మధ్య పార్టీ, ప్రభుత్వ అంశాలు చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు గురించి ఇరువురు చర్చించినట్లుగా సమాచారం. పార్టీ నాయకుల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, సలహాలను సీఎం రేవంత్రెడ్డికి ఆమె తెలిపినట్లుగా సమాచారం. కులగణన దేశ వ్యాప్తంగా తెలంగాణ ఆదర్శం కావడంతో దాని కొనసాగింపుగా ఏం చేయాలనే దానిపై కూడా చర్చించినట్లుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరుపై డిస్కస్చేశారని తెలిసింది. దీనితో పాటుగా జూన్2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను సీఎం వివరించినట్లుగా సమాచారం. ఆ రోజు ప్రారంభించే రాజీవ్యువ వికాసం తదితర వాటి గురించి తెలిపినట్లుగా సమాచారం. పెండింగ్లో ఉన్న పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గం, నామినెటెడ్ పోస్టులు, డీసీసీ అధ్యక్షుల నియామకం తదితర వాటి నియామకానికి సంబంధించి కార్యచరణను చర్చించినట్లుగా తెలిసింది. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీనాక్షి నటరాజన్, అందుబాటులో మంత్రులతో కలిసి భోజనం చేసినట్లుగా సమాచారం.






