CM Revanth Reddy: మాదిగలకు అన్యాయం జరగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   ( Updated:2024-12-14 10:43:01.0  )
CM Revanth Reddy:  మాదిగలకు అన్యాయం జరగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని ఈ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం మాదాపూర్ లోని దస్పల్ల హోటల్ (Hotel Daspala) లో జరిగిన గ్లోబల్ మాదిగ డే-2024 (Global Madiga Day -2024) కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదని న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ మీకు తప్పక న్యాయం చేస్తామన్నారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి క్రియాశీల పాత్ర పోషించిందన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకే నిర్ణయం:

సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మా ప్రభుత్వం ప్రకటించిందని అయితే తెలంగాణ విభజన సమస్యలా ఎస్సీ వర్గీకరణ (SC classification) సమస్య జఠిలంగా మారిందన్నారు. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మీ వాదనలో బలం ఉంది, మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించామన్నారు. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించుకున్నామని వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించామని చెప్పారు. ఐఐటీ వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామన్నారు. పగిడి పాటి దేవయ్యను స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నామని అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed