స్టార్ హీరోతో కలిసి మ్యాచ్ చూస్తున్న CM రేవంత్ రెడ్డి (PHOTO)

by Disha Web Desk 2 |
స్టార్ హీరోతో కలిసి మ్యాచ్ చూస్తున్న CM రేవంత్ రెడ్డి (PHOTO)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ మైదానానికి వెళ్లారు. ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యా్చ్‌ను వీక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈ మ్యాచ్‌ చూసేందుకు ఉప్పల్ మైదానానికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. చెన్నై రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, చివరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.





Next Story

Most Viewed