కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ.. పొన్నాల లక్ష్మయ్య సెటైర్

by Disha Web Desk 2 |
కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ.. పొన్నాల లక్ష్మయ్య సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌కు అందుతున్న చికిత్స గురించి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాల్లో ఇది మంచి పరిణామం అని పలువురు సంతోషం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారంగా మారాయి.

రేవంత్ రెడ్డి పరామర్శ ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకొని సెటైరికల్ క్యాప్షన్ ఇచ్చారు. 'నన్ను కనీసం ఏడాదిపాటైనా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గారు' అంటూ వేడుకుంటున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య పేరుతో ఈ వాట్సాప్ స్టేటస్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పలువురు నెటిజన్లు లక్ష్మయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు ఇందులో నిజమెంతా అని ఆరా తీస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed