CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వ నిర్ణయాలకు జ్యోతిబాఫూలే స్ఫూర్తి ప్రదాత: రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |

మహత్మ జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు.

CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వ నిర్ణయాలకు జ్యోతిబాఫూలే స్ఫూర్తి ప్రదాత: రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫూలే (Mahatma Jyothibha Phule) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిబాఫూలే సామాజిక ఉద్యమాలకు మార్గదర్శిగా, బహుజన చైతన్య దీప్తిగా నిలిచి వివక్షలపై పోరాడి, మహిళా విద్యకు విశేష కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ఫూలే స్ఫూర్తితోనే సామాజిక సాధికారత కోసం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం తీసుకున్న సమగ్ర కుల గణన, బీసీలకు 42 శాతం కోటా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక న్యాయ సాధికారత నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం చెప్పారు.

Next Story