రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు.

రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబంతోసహా తిరుమలకు వెళ్లి, ప్రత్యేక పూజలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వారం ద్వారా ఈ అర్థరాత్రి నుంచి శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ సిద్ధం అయింది. భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ పటిష్ట చర్యలు తీసుకుంది.

Next Story