రేపు కొడంగల్‌కి సీఎం రేవంత్.. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం

by Ramesh Naini |   (  Updated:2025-12-23 10:46:14  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24 (రేపు) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌‌కి వెళ్లనున్నారు.

రేపు కొడంగల్‌కి సీఎం రేవంత్.. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24 (రేపు) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌‌కి వెళ్లనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి చర్చ జరపనున్నారు.

గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే వారితో కలిసి భోజనం (లంచ్) చేయనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాగా, సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలతో పాటు కార్యక్రమ నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.

READ MORE ....

CM Revanth Reddy: నూతన సర్పంచ్ లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Next Story