శ్రీమద్ భాగవతం షూటింగ్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం(Srimad Bhagavatam) పార్ట్-1” చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

శ్రీమద్ భాగవతం షూటింగ్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం(Srimad Bhagavatam) పార్ట్-1” చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. సీఎంతోపాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

Next Story