- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులగణనపై మరోసారి CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు.

దిశ, వెబ్డెస్క్: విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బసవన్న స్ఫూర్తితోనే రాష్ట్రంలో కుల గణన చేపట్టామని అన్నారు. బసవేశ్వరుడు సామాజిక న్యాయం అందించేందుకు ఎంతో కృషి చేశారని విశ్వగురు విధానాలను స్మరించుకున్నారు. బసవన్న స్ఫూర్తి సందేశానికి అనుగుణంగా ప్రభుత్వం(Congress Govt) ముందుకు వెళుతోందని, వారి సందేశమే పరిపాలనకు సూచిక అని అన్నారు. పేదలకు న్యాయం జరగాలని ఆనాడు అనుభవ మంటపాల ద్వారా తెలుసుకున్న విశ్వగురు ఆదర్శంగానే ప్రస్తుతం పార్లమెంట్, శాసనసభలు నిర్వహించుకుంటున్నామని వివరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి రామోదర్ రాజనర్సింహా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
విశ్వగురు శ్రీ బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.… pic.twitter.com/lcYF6gzHN7
— Telangana CMO (@TelanganaCMO) May 23, 2025






