UPSC తరహాలో టీఎస్‌పీఎస్‌సీ.. ఢిల్లీలో సీఎ రేవంత్ కీలక భేటీ

by Disha Web Desk 2 |
UPSC తరహాలో టీఎస్‌పీఎస్‌సీ.. ఢిల్లీలో సీఎ రేవంత్ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండోరోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి గురువారం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. శుక్రవారం యూపీఎస్‌సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. పేపర్ లీకేజీల వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పరీక్షణ నిర్వహణలో యూపీఎస్‌సీ అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. యూపీఎస్‌సీ తరహాలోనే టీఎస్‌పీఎస్‌సీని కూడా పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నాపత్రాలు మళ్లీ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed