CM Revanth Reddy: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by Prasad Jukanti |

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

CM Revanth Reddy: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupendra Yadav) తో (CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు, పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని అటవీ భూములకు సంబంధించి పర్యావరణ అనుమకులు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నది. వీటికి సంబంధించి ఇప్పటికే పంపించిన ప్రతిపాదనలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని భూపేంద్ర యాదవ్ ను సీఎం కోరినట్లు తెలిసింది. ఈ భేటీలో సీఎంతో పాటు భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Next Story