నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం మా సంస్కృతి: సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
నేనూ రైతు బిడ్డనే.. వ్యవసాయం మా సంస్కృతి: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నేను రైతు బిడ్డను.. వ్యవసాయం మా సంస్కృతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశంలో ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖుల సమావేశంలో ప్రసంగించారు. తనకు రైతుల కష్టాలు తెలుసని చెప్పారు. ఇండియాలో రైతులు ఆత్మహత్యలు ఒక పెద్ద సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాలో రైతులకు ఆదాయం లేదని తెలిపారు. వ్యవసాయం విషయంలో రైతులకు మోడ్రన్ టెక్నాలజీ లేదన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు పంటకు (ఎంఎస్‌పీ) మద్దతు ధర కల్పించిందన్నారు.

వ్యవసాయ సాగుకు తాము రైతులకు ఇన్వెస్ట్‌మెంట్ కోసం డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా పేరుతో రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పారు. మద్దతు ధర కంటే ఎక్కువగా రైతులకు లాభాలు రావడం తన కల అని తెలియజేశారు. 99 శాతం రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని తాము చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు లాభాలు గడించేలా చేయాలన్నారు. రైతులు ఎప్పుడు ప్రపంచానికి సాయం చేస్తారని, కాబట్టి ప్రపంచం కూడా రైతలకు సాయం చేయాలని కోరారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story