నిరుద్యోగులకు CM రేవంత్ రెడ్డి శుభవార్త.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
నిరుద్యోగులకు CM రేవంత్ రెడ్డి శుభవార్త.. మెగా డీఎస్సీపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ నేతలను పిలుపునిచ్చారు. గత ప్రభుత్వలో అణిచివేతకు గురైన అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని తెలిపారు. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోనని.. వాళ్ల రుణం తీర్చుకొని తీరుతానని మాటిచ్చారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో రెండు కీలక హామీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు.

ఇచ్చిన మాటను అటు సోనియా గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తప్పలేదని గుర్తుచేశారు. మన చిరకాల కోరిక అయిన తెలంగాణ ఇచ్చి కోట్లాది ప్రజల ముఖాల్లో చిరున్వవ్వు నింపారని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇవాళ పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు. పేదల గురించే కాదు.. నిరుద్యోగుల గురించి కూడా కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు. కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.


Next Story