CM KCR Delhi Tour: కుటుంబ సభ్యులతో కలిసి మరి కాసేపట్లో ఢిల్లీకి సీఎం కేసీఆర్

by Disha Web Desk |
CM KCR Delhi Tour: కుటుంబ సభ్యులతో కలిసి మరి కాసేపట్లో ఢిల్లీకి సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో ఢిల్లీకి పయనం కాబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే తొలిసారి ఢిల్లీ టూర్ కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు, ముఖ్యనేతలతో కలిసి సీఎం ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ మార్గ్‌లో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఈ నెల 14వ తేదీన కేసీఆర్ ప్రారంభిచనున్నారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్‌కు జాతీయ నేతలను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఢిల్లీలో వేద పండితుల ద్వారా పూజలు, యాగాల నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, యాగం ఏర్పాట్లను ఇప్పడికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పరిశీలిస్తున్నారు. ఇవాళ హస్తినాకు చేరుకోనున్న కేసీఆర్ రేపు ఉదయం పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పనులను పరిశీలిస్తారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ సందర్భంగా సర్దార్ పటేల్ మార్గ్ లోని అన్ని రోడ్లలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి.

Next Story

Most Viewed