Singareni: సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. రికార్డ్ స్థాయిలో బోనస్ ప్రకటన

by Disha Web Desk 19 |
Singareni: సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. రికార్డ్ స్థాయిలో బోనస్ ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం మరో శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది. తాజాగా 32 శాతం బోనస్ అందివ్వాలన్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది.


Next Story