ఏపీకి ఇచ్చారు... తెలంగాణకు అన్యాయం చేశారు: Cm Kcr

by srinivas |
ఏపీకి ఇచ్చారు... తెలంగాణకు అన్యాయం చేశారు: Cm Kcr
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణకు రావాల్సిన రూ.473 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని ఏడేళ్లుగా కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థ అంటే ఇదేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Next Story