బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నెలలో ఖాళీ కానున్న మూడు మండలి స్థానాలకు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంక్రటామిరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కాగా, ఈ నెల 9వ తేదీన నామినేషన్లు వేయాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్ననట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న బీఆర్ఎస్ ఆశవాహులకు తీవ్ర నిరాశ ఎదురైంది.


Next Story

Most Viewed