- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు సీఎల్పీ భేటీ.. కాళేశ్వరం అక్రమాలపై శ్వేతపత్రంపై చర్చ
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న నేఫథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది.ఈ నెల 12న అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాగా కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది.
Next Story