ఇరు వర్గాల ఘర్షణ.. రాడ్‌తో దాడి చేయడంతో యువకుడు..

by Disha Web Desk 4 |
ఇరు వర్గాల ఘర్షణ.. రాడ్‌తో దాడి చేయడంతో యువకుడు..
X

దిశ, మల్యాల : మండల కేంద్రంలోని రాజారం గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి జరిగిన ఘటనలో కర్రలు ఇనుప రాడ్లతో యువకులపై దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. రాజారం గ్రామానికి చెందిన గుర్రం ప్రవీణ్ వెంకటేష్ అనే యువకులపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ఇంపరాడ్లతో దాడి చేయడంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ దాడిలో వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన శివరాత్రి నరేష్ భాగ్యరాజుగా గుర్తించామని, ఈ ఘర్షణ మద్యం మత్తులో జరిగిందా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయ అనె కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి తెలిపారు.

Next Story

Most Viewed