ఈనెల 21న LB స్టేడియంలో క్రిస్మస్ విందు

by GSrikanth |
ఈనెల 21న LB స్టేడియంలో క్రిస్మస్ విందు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 21వ తేదీన క్రైస్తవ సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ విందు ఇస్తారని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్‌ వేడుకలను పేదలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం గిఫ్ట్‌ ప్యాక్‌‌లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎస్ఆర్ గార్డెన్‌లో క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌ సర్వమతాలను గౌరవిస్తూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నదని అన్నారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్‌ సమన్యాయం చేస్తున్నారని, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో 4,000 కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీలు సుధారాణి, బాదినేని రాజేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచ్ శేఖర్, డీడబ్ల్యూఓ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed