- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చింతల్ వెళ్తున్నారా? చిన జీయర్ కీలక ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా మచ్చింతల్లో ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రానికి భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. ఈ క్ర

X
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రానికి భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో సందర్శకులకు పలు సూచనలు చేస్తూ చినజీయర్ స్వామి సోమవారం కీలక ప్రకటన విడుదల చేశారు. సమతామూర్తి కేంద్రంలో మండల అభిషేకాలు, ఆరాధనలు జరగనున్నందున ఈనెల 29 నుంచి వచ్చే ఏప్రిల్ 1 వరకు సందర్శకులకు ప్రవేశం ఉండదని వెల్లడించారు. ఆలయాన్ని తిరిగి ఉగాది రోజున సందర్శించవద్దు అని తెలిపారు. అయితే, ప్రతి బుధవారం సెలవు ఉంటుందని, ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఆలయంలోకి సెల్ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని.. పాదరక్షలు బయటే వదలాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదని సూచించారు.
Next Story






