హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. కాగా, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వార్షిక సమ్మిట్‌లో పాల్గొని తెలంగాణకు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం రెండింతల కంటే ఎక్కువ వచ్చాయి. గడిచిన మూడేండ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులను కలిపి పోల్చినా ఈ యేడు రానున్న ఇన్వెస్టుమెంట్లే అధికం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు, మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది.



Next Story

Most Viewed