గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యం: సీఎం కేసీఆర్

by Disha Web Desk 2 |
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యం: సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా గాంధీ 154వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గాంధీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని సీఎం తెలిపారు.

వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని సీఎం అన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకొని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.


Next Story