BRS నేతల ఇళ్లల్లో తనిఖీలు.. ఉద్రిక్తతలు

by Muthe.Rajitha |

జూబ్లిహిల్స్ ఎన్నికల నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

BRS నేతల ఇళ్లల్లో తనిఖీలు.. ఉద్రిక్తతలు
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లిహిల్స్ ఎన్నికల నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మోతీనగర్ లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితోపాటు, కూకట్ పల్లిలోని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. ఈ క్రమంలో జనార్ధన్ రెడ్డికి, పోలీసులకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రేవంత్ రెడ్డి ఇలాంటి తనిఖీలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మారారని రవీందర్ రెడ్డి ఆరోపించించారు. అయితే తాము రూల్స్ ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని, తమ మీద ఎవ్వరి ఒత్తిడి లేదని పోలీసులు చెబుతున్నారు.

Next Story