- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలి ఎఫెక్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్పు
తెలంగాణను ముఖ్యంగా ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణను ముఖ్యంగా ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోతున్న క్రమంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాఠశాలల పనివేళలను మార్చారు. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు, చలిగాలుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున వారి ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న పాఠశాల సమయాన్ని, ఇకపై ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు అమలు చేయనున్నారు. ఈ మార్పులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐఎండీ నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, నిబంధనలు పాటించకుండా ముందుగానే పాఠశాలలు ప్రారంభిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ హెచ్చరించారు.






