ఇవాళ చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్ ల్యాండర్.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ

by Disha Web Desk 4 |
ఇవాళ చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్ ల్యాండర్.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇవాళ చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ దిగనుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ చేరుకోనుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు చంద్రయాన్ - 3 యత్నిస్తోంది. చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డుకు ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైతే భారత్ ఖాతాలో కొత్త రికార్డ్ చేరనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ నిలవనుంది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో రష్యా విఫలం అయింది. చంద్రయాన్ - 3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఎల్‌ఎంవీ3ఎం 4 రాకెట్ ద్వారా చంద్రయాన్ - 3 ప్రయోగం చేపట్టారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే కీలకమని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed