- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్పగా ఆలోచించండి కేటీఆర్: ఎంపీ చామల
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మల్యే కేటీఆర్(MLA KTR)పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Kirankumarreddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మల్యే కేటీఆర్(MLA KTR) భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Kirankumarreddy) ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సంకుచ మనస్తత్వంతో ఆలోచన చేయడం మానేసి, గొప్పగా ఆలోచించాలని సూచించారు. 'హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలను వేల మైళ్ల దూరం ప్రయాణించి స్విట్జర్లాండ్లోని దావోస్కు తీసుకెళ్లి వాటిని పెట్టుబడులుగా ప్రకటించడమే విన్నూతమైన ఆలోచనా' అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి బుధవారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెడుగా ఆలోచించే మనిషికి, ప్రతీ విషయంలోనూ చెడే కనిపిస్తుందని విమర్శించారు. కేటీఆర్తెలంగాణ ప్రచారకర్త అని చెప్పుకుంటూనే, తెలంగాణ పురోగతిని అణగదొక్కడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, దీనిని కేటీఆర్జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.






