11న “ ఛలో హైదరాబాద్​” మహా ధర్నా

by velandi.Saikiran |

శాసనసభ ఎన్నికల్లో పెన్షనర్ల పూర్తి సహకారంతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్​ప్రభుత్వం ప్రస్తుతం పెన్షనర్లను పూర్తిగా

11న “ ఛలో హైదరాబాద్​” మహా ధర్నా
X

పెన్షనర్ల సమస్యలపై

11న “ ఛలో హైదరాబాద్​” మహా ధర్నా

= టీజీపీ జేఏసీ ఛైర్మన్​ కే.లక్ష్మయ్య

దిశ, తెలంగాణ బ్యూరో : శాసనసభ ఎన్నికల్లో పెన్షనర్ల పూర్తి సహకారంతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్​ప్రభుత్వం ప్రస్తుతం పెన్షనర్లను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వాన్ని, మంత్రులను కలిసి విన్నవిస్తున్న తమ సమస్యలు పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్​కే. లక్ష్మయ్య ఆరోపించారు. సోమవారం సంఘం జనరల్​సెక్రటరీ పి.కృష్ణమూర్తి, చైర్​పర్సన్​ఆర్​. ఉమాదేవి తదితరులతో కలిసి సచివాలయం మీడియా పాయింట్​వద్ద వారు మాట్లాడారు. రాష్ట్రంలో వరుస కేబినెట్​సమావేశాలు జరుగుతున్నా కూడా పెన్షనర్ల సమస్యలు మాత్రం ప్రభుత్వ ప్రస్తావనకే రావడం లేదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షలకు పైగా పెన్షనర్లు తీవ్ర నిరాశ నిస్ప్రహలలకు , ఆవేదనకు లోనవుతున్నారన్నారు. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టు 11న ఇందిరా పార్కు వేదికగా ‘ ఛలో హైదరాబాద్ ’ ​మహా ధర్నా నిర్వహిస్తామని ఛైర్మన్​లక్ష్మయ్య ప్రకటించారు.


ఇప్పటికైనా ఈహెచ్​ఎస్​నగదు రహిత చికిత్స అందించాలని, రిటైర్డ్​పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్​, జీపీఎస్​చెల్లించాలని, రూ.398 వేతనంతో నియమితులైన స్పెషల్​టీచర్లకు నోషనల్​ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, వివిధ శాఖలలో సేవలు అందించి రిటైర్​అయిన పెన్షనర్లు అందరికీ ట్రెజరీ ద్వారా పెన్షన్​చెల్లించాలని, పెన్షనర్స్​డైరెక్టరేట్​ను ఏర్పాటు చేయాలని, సమావేశాలు, ఉత్సవాల నిర్వహణకు నూతన పెన్షనర్స్​భవన్​నిర్మించాలని, 1 వ పీఆర్​సీ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం 20 సంవత్సరాలకే పూర్తి పెన్షన్​మంజూరు చేయాలని , తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్లే , పెన్షనర్లకు కూడా ఇన్​సెంటివ్​ప్రకటించాలని, సీనియర్​సిటిజన్లు అయిన పెన్షనర్లకు ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో 50 శాతం రాయితీ కల్పించాలని, కాంగ్రెస్​మేనిఫెస్టోలో పెట్టినట్లుగా డీఏ, డీఆర్​అన్ని వాయిదాలు విడుదల చేసి మంచి ఫిట్​మెంట్​తో పిఆర్​సీని వెంటనే ప్రకటించాలని, నూతన పెన్షన్​విధానాన్ని ఎన్​పీఎస్​ను రద్దు పరిచి ఓల్డ్​పెన్షన్​విధానం ఓపిఎస్​నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ నాయకులు తులసి సత్యనారాయణ, డాక్టర్​అరుణ, భరత్​రెడ్డి, రాజేంద్రబాబు, ధనలక్ష్మి, పుల్లయ్య, పెద్ది రమేష్​, మోహన్​నారాయణ, నరసరాజు, దేవేందర్​పాల్గొన్నారు.

Next Story