TS News: తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు

by Disha Web Desk |
TS News:  తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామి పథకంలో అవకతవకలు జరిగాయని కేంద్రం నిర్థారించినట్లు తెలిపింది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను పంపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్) నిధులను కేంద్ర పథకం మార్గదర్శకాల ప్రకారం అనుమతించని పథకాలకు మళ్లించినందుకు రూ. 151.9 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపించింది. తిరిగి చెల్లించేందుకు కేసీఆర్ సర్కార్ గ్రామీణాభివృద్ధి శాఖకు నవంబర్ 30(రెండు రోజులు) వరకు కేంద్రం గడువు ఇచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. తదుపరి వాయిదాలను నిలిపివేయనున్నట్టుగా తెలిపింది. కాగా, ఇప్పటికే కేసీఆర్ సర్కార్‌కు, మోడీ సర్కార్‌కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం జారీ చేసిన నోటీసులు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య మరోసారి మాటల యుద్ధం తెరదీసే అవకాశం ఉంది.



Next Story