ఎమ్మెల్యే ఈటల, ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం ఉత్తర్వులు

by GSrikanth |
ఎమ్మెల్యే ఈటల, ఎంపీ అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్ భద్రతను కేటాయించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఈటల భార్య జమున, అలాగే, తనకు ప్రాణహాని ఉందని స్వయంగా ఈటల మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి విదితమే. ఈటలతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సైతం వై కేటగిరీ భద్రతను కేంద్రం కేటాయించింది. అంతేగాక, ఈ విషయమై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి.. కేటగిరీ భద్రతను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed