CBSE కొత్త రూల్.. ఫెయిల్ అయినవారు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు

by Disha Web Desk 9 |
CBSE కొత్త రూల్.. ఫెయిల్ అయినవారు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సీబీఎస్‌ఈ తీపికబురు అందించింది. ఈ వారంలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 2023-24 అకాడమిక్ ఇయర్ కోసం సీబీఎస్ఈ బోర్డు కొన్ని కొత్త అప్‌డేట్స్‌ను నోటిఫికేషన్ ద్వారా ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కంపార్ట్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను బోర్డ్ నిర్వహించడం లేదు. వాటికి బదులుగా అనుబంధ పరీక్షలను నిర్వహించడానికి సిద్ధమైంది. కంపార్ట్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల పేరును సప్లిమెంటరీ పరీక్షలుగా మార్చింది. ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను మళ్లీ రాయాల్సి ఉంటుంది. కానీ కొత్త రూల్ ప్రకారం థియరీ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం పాఠశాలలో ప్రాక్టికల్‌కు హాజరు అయితే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% స్కోరు చేయాలి. అలాగే ఎక్స్‌టర్నల్ పేపర్స్‌ను బేస్ చేసుకొని ఉత్తీర్ణతను నిర్ధారిస్తారు.

Also Read...

పదో తరగతి ఫలితాలపై ఎస్ఎస్సీ బోర్డు అధికారుల ప్రకటన



Next Story

Most Viewed