- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court : రేపు సుప్రీంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLA's) కేసు రేపు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణకు రానుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLA's) కేసు రేపు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు ఆ పార్టీకి చెందిన నాయకులు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయం స్పీకర్ కు వదలడంతో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) చర్యలు తీసుకోలేదని సుప్రీంను ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ(BRS Party). కాగా గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలపగా.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన స్పీకర్ తరపు న్యాయవాది సమాధానం తెలియజేశారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపు డిసైడ్ కానుంది.






