బీటెక్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ గడువు పెంపు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ మొదటి సంవత్సరం మేనేజ్ మెంట్ కోటా (బీ-కేటగిరీ) సీట్ల అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రకటించింది.

బీటెక్ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ గడువు పెంపు
X
  • ఈ నెల 18 నుంచి 25 వరకు పెంపు
  • వర్షాల నేపథ్యంలో గడువు పెంపు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ మొదటి సంవత్సరం మేనేజ్ మెంట్ కోటా (బీ-కేటగిరీ) సీట్ల అడ్మిషన్ల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మండలి తెలిపింది. ఈ నెల 18 వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి అడ్మిషన్ల గడువు ఉండగా, ప్రస్తుతం ఈ గడువును ఆగస్టు 25 వరకు పొడిగించారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీకేటగిరీ కింద ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాను ఈ నెల 30లోగా కౌన్సిల్‌కు సమర్పించాలని కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించినట్టయింది. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ కాలేజీల యాజామాన్యాలు సైతం తమ కాలేజీల్లో అడ్మిషన్ల కొరత ఉందని, గడవును పొడిగించాలని కోరినట్లు సమాచారం.

Next Story