'కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం'

by Disha Web Desk 2 |
కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ల ముంపునతో రూ.1.020 కోట్ల నష్టం వాటిల్లిందని ఇంజినీర్ల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కన్నెపల్లి పంపుహౌజ్‌లో అడిషనల్‌ టీఎంసీ కోసం ఏర్పాటు చేసిన ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అవి ఉపయోగ పడకుండా చెడిపోయాయని తేల్చి చెప్పింది. వాటి స్థానంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలని నివేదికలో సూచించింది. తాజాగా.. దీనిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. #కేసీఆర్‌‌ఫెయిల్డ్‌తెలంగాణ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'ఈ నష్టాన్ని కేసీఆర్ కుటుంబమే భరించాలి. లేకుంటే మేమే మీ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం. #KCRFailedTelangana'' అని పేర్కొన్నారు.

Also Read : సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు

సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు

సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు


Next Story

Most Viewed