ఆదివాసీలపై కేసీఆర్ చూపిస్తున్నది వట్టి నటనే.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Dishafeatures2 |
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివాసీలపై సీఎం కేసీఆర్ చూపిస్తున్నది వట్టి నటనేనని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేద బిడ్డలు చదువుకునే ఆశ్రమ పాఠశాలలకు గత ఏడాది నుండి చిల్లిగవ్వ కూడా విడుదల చేయకుండా చదువులకు దూరం చేశారని ఆరోపించారు. ఆదివాసులను శాశ్వతంగా చీకటిలోకి నెట్టడమే కేసీఆర్ ధ్యేయంగా కనబడుతోందని మండిపడ్డారు. బహుజన రాజ్యంలో ఆదివాసీలు పాలకులుగా మారుతారని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed