సాయిచంద్ మృతి తీరని లోటు.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Dishafeatures2 |
సాయిచంద్ మృతి తీరని లోటు.. బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి బహుజన సమాజానికి తీరని లోటని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం దిగ్భ్రాంతికరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేరోస్ నెట్ వర్క్ కార్యక్రమాల్లో సాయిచంద్ తో ఎన్నో వేదికలు పంచుకున్నా అని ఆయన గుర్తు చేసుకున్నారు.

తన పదునైన గళంతో సాయిచంద్ అంబేద్కర్ ఆలోచనలను జనంలోకి తీసుకపోయిన తీరు అమోఘమని ఆర్ఎస్పీ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ప్రజలను ఉత్తేజపరిచారని అన్నారు. ఆయన కుటుంబానికి బహుజన సమాజం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. కాగా సాయిచంద్ (39) గుండెపోటుతో ఇవాళ ఉదయం అకాల మరణం చెందారు.



Next Story

Most Viewed