- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేపు కేసీఆర్ ప్రెస్ మీట్.. ప్రచారం చివరి రోజున కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు?
దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వానికి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన మరికొన్ని గంటలను పక్కాగా ఉపయోగించుకుని ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ మనుగడను నిర్ధారించేవిగా మారాయనే చర్చ జరుగుతోంది. అందువల్ల వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా తిరిగి తమ సత్తా ఎంటో నిరూపించుకునేందుకు గులాబీ బాస్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు బస్సు యాత్ర రూపంలో రాష్ట్రమంతా చుట్టి వచ్చిన కేసీఆర్ ప్రచారానికి చివరి రోజు మాత్రం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బీజేపీని, కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ మీడియా సమావేశంలో ఏయే అంశాలపై మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.