BRS ఆఫీస్ ఇనాగరేషన్ : ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్

by Disha Web Desk 4 |
BRS ఆఫీస్ ఇనాగరేషన్ : ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే ఢిల్లీకి పయనమయ్యారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అకాల వర్షాలతో పంట నష్టాలపై సమీక్ష కారణంగా నిన్న సీఎం టూర్ వాయిదా పడింది. కాగా తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గులాబీ బాస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఢిల్లీలోని వసంత్ విహార్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ కు మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం చేరుకోనున్నారు. హోమం, యాగం, వాస్తు పూజల్లో సీఎం పాల్గొననున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కార్యాక్రమాలను ఇప్పటికే పూర్తి చేశారు. అయితే 1500 గజాల స్థలంలో మూడు అంతస్తులతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.

Read more:

కవిత ఫ్యామిలీపై ఈడీ స్పెషల్ ఫోకస్! ఆ సంస్థల్లో సోదాలు?


Next Story

Most Viewed