మేడిగడ్డలో నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఇదే.. వినోద్ కుమార్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 2 |
మేడిగడ్డలో నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఇదే.. వినోద్ కుమార్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోదు అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ లిక్కర్ కేసును వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అరెస్టులు మంచిది కాదన్నారు. కేసులు పెట్టి రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేజ్రీవాల్‌ను‌ విచారణ కోసమే అరెస్టు చేశారని చెప్పారు.

మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో పిల్లర్లు కుంగిన మాట వాస్తవమే.. కానీ, కేసీఆర్ చెప్పిందే చేశామని ఎల్‌అండ్‌టీ సంస్థ అనడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంజినీర్ కాదు.. కాకపోతే ఆయన ప్రో యాక్టీవ్‌గా ఉంటారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పు ఉందని భావిస్తే ప్రజలు సహించరు అని అన్నారు. తప్పులేదు కాబట్టే తమను పూర్తిగా తిరస్కరించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు కట్టబెట్టారని గుర్తుచేశారు. లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.



Next Story

Most Viewed