Breaking: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత.. అధికారులు సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
Breaking: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత.. అధికారులు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఉంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీన టీమ్ హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో ఢిల్లీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత అమలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా ఈడీ కార్యాలయం వద్దకు వెళ్లారనే అంచనాలతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story

Most Viewed