BRS: చట్టం ముందు అందరూ సమానులే.. ‘పుష్ప-2’ టీమ్‌పై BRS నేత సీరియస్

by Gantepaka Srikanth |

అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

BRS: చట్టం ముందు అందరూ సమానులే.. ‘పుష్ప-2’ టీమ్‌పై BRS నేత సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా.. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప-2 చిత్రబృందంతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు వరుగా కంప్లైంట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘తొక్కిసలాటో రేవతి మృతిచెందడం బాధాకరం. ఈ ప్రాణనష్టానికి సంధ్య థియేటర్ యజమాన్యం, స్థానిక పోలీసులు ఇద్దరూ సమానంగా బాధ్యులు. పోలీసులు భద్రత అయినా ఏర్పాటు చేసి ఉండాలి.. లేకపోతే అక్కడ సంబురాలకు పర్మిషన్ అయినా నిరాకరించి ఉండాలి. చిత్రబృందం పర్యటన పెట్టుకున్నప్పుడు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఒక రకంగా ఈ ఘటనకు సినిమా హీరో కూడా కారణమే. చట్టం ముందు అందరూ సమానులే’ అని అన్నారు.

Next Story