బ్రేకింగ్: కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత..

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత..
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీ ఆందోళనకు దిగాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. రంగలోకి దిగిన పోలీసులు కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త నెలకొంది. కోస్గిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇరువర్గాల ఆందోళనతో కోస్గిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Next Story

Most Viewed