BREAKING: కరీంనగర్‌కు ఎవరేం చేశారో తేల్చుదాం: ఎంపీ బండి సంజయ్

by Disha Web Desk 1 |
BREAKING: కరీంనగర్‌కు ఎవరేం చేశారో తేల్చుదాం: ఎంపీ బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత రీతిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ అభవృద్ధిపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ ఎవరేం చేశారో తేల్చుదామంటూ సవాల్ విసిరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ గెలిస్తే.. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే కరీంనగర్‌లో అడుగు పెట్టలేరని అన్నారు.

Also Read..

కేటీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్



Next Story

Most Viewed