BREAKING: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన.. వీధి కుక్కల దాడిలో నవజాత శిశువు మృతి

by Disha Web Desk 1 |
BREAKING: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన.. వీధి కుక్కల దాడిలో నవజాత శిశువు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మానవత్వానికే మచ్చతెచ్చిన అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో ఇవాళ చోటుచేసుకుంది. భీమిని మండల పరిధిలోని కేస్లాపూర్ గ్రామంలో నిన్న రాత్రి 8 నెలల వయసు గల నవజాత శిశువును గుర్తు తెలియని మహిళ గ్రామ శివారులోని చేనులో వదిలేసి వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ జన సంచారం లేకపోవడంతో వీధి కుక్కలు చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ ప్రమాదంలో నవజాత శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని చేనులో వదిలి వెళ్లిన నిందితురాలు గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



Next Story

Most Viewed