BREAKING: ప్రజల దృష్టిని మళ్లించేందుకే క్రిశాంక్‌పై అక్రమ కేసులు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

by Disha Web Desk 1 |
BREAKING: ప్రజల దృష్టిని మళ్లించేందుకే క్రిశాంక్‌పై అక్రమ కేసులు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిశాంక్‌పై అక్రమ కేసు పెట్టి ఆయన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారంటూ ఆయన మీడియాకు తెలిపారు. కుంభకోణం ఆరోపణలు వస్తే.. ఆధారాలతో నిరూపించాలని కానీ, ఇలా ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించేలా ప్రజల దృష్టి మళ్లించేందుకు క్రిశాంక్‌పై ప్రభుత్వం అక్రమంగా కేసును బనాయించిందంటూ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed