- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ అంశాలపై రాహుల్తో కీలక భేటీ
by Kema Shiva Kumar |
లష్కర్ బోనాల సందర్భంగా ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి నేరుగా ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు.

X
దిశ, వెబ్డెస్క్: లష్కర్ బోనాల సందర్భంగా ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి నేరుగా ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసిన నేపథ్యంలో వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే సర్కార్ యోచిస్తోంది. అయితే, ఆ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి సీఎం రాహుల్ గాంధీని కలవబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఎన్డీఎస్ఏ చైర్మన్తో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు.
Next Story






