బ్రేకింగ్: MIM కార్పొరేటర్ ఖాదర్‌పై కేసు నమోదు

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: MIM కార్పొరేటర్ ఖాదర్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాంనాస్పుర డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ ఖాదర్‌పై కేసు నమోదైంది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచీ గల్లీలో బీజేపీ నిర్వహించిన వీధి సభపై కార్పొరేటర్ ఖాదర్, అతడి అనుచరులు దాడి చేశారు. దీంతో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో కార్పొరేటర్ ఖాదర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీ 341, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్పొరేటర్ ఖాదర్‌తో సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, బీజేపీ నిర్వహించిన స్ట్రీట్ మీటింగ్‌పై దాడి చేసి.. ఖాదర్, అతడి అనుచరులు సభ ప్రాంగణంలోని కుర్చీలను విరగొట్టిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed