BREAKING: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

by Disha Web Desk 1 |
BREAKING: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. రానున్న రెండు, మూడు రోజుల్లో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలపింది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి. రాత్రి పూట 26 డిగ్రీలు వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అస్కారం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోని ఉష్ణోగ్రతలు ఎల్బీ నగర్‌లో 36 డిగ్రీలు, బేగంపేటలో 35 డిగ్రీలు, జూబ్లీ హిల్స్‌లో 324 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.


Next Story

Most Viewed