BREAKING: ప్రణీత్ రావు పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

by Disha Web Desk 1 |
BREAKING: ప్రణీత్ రావు పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, విచారణ సందర్భంగా ప్రణీత్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చిందని వాదించారు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్‌లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్‌లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. అదేవిధంగా పోలీసులు దర్యా్ప్తు అంశాలను మీడయాకు లీక్ చేస్తున్నారంటూ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story

Most Viewed