BREAKING: జమ్మికుంట తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు.. కొనసాగుతున్న సోదాలు

by Disha Web Desk 1 |
BREAKING: జమ్మికుంట తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు.. కొనసాగుతున్న సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏసీబీ అధికారులు మరో‌సారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో సోదలు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రెయిడ్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రజని దగ్గర బంధువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో సోదాలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎంత డబ్బును కనుగొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed